బూర్గంపాడు: అధికారులునిర్లక్ష్యమా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా...?

55చూసినవారు
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల గాంధీనగర్ లో గత పది సంవత్సరాల క్రితం ఎస్సీ కమ్యూనిటీ హాల్ అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. గ్రామస్తుల ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు తెలియజేస్తే దానిపై వివరణ ఇవ్వమని, అలాగే ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్ వేసి ఇవ్వమని అధికారులకు 8 నెలల క్రితం తెలియజేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదని, ఇలా అసంపూర్తిగా వదిలేయడానికి గల కారణం అధికారుల నిర్లక్ష్యమా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా.? అని శనివారం స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్