నేడు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా

52చూసినవారు
నేడు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మణుగూరు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాకార్యక్రమాలు చేపట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో అభ్యర్ధులను మోసం చేస్తోందని ఆరోపించారు. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు పరీక్షలను వాయిదా వేయాలని కోరినా ప్రభుత్వం మొండివైఖరితో పరీక్షలను నిర్వహిస్తోందన్నారు.