అశ్వాపురం మండలం మొండికుంటలో తెలంగాణ ప్రభుత్వం యజ్ఞంలా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం మొండికుంట గ్రామ పంచాయితీలో ఇంటి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎంపిటిసి కమటం నరేష్ ప్రారంభించారు. ప్రతి ఇంటికి జామ, నిమ్మ, ఉసిరి, కానుగ, మందారం, మునుగ ఒక్కొక్క చెట్టు చొప్పున ప్రతి ఇంటికి 6 చెట్లను అందిస్తున్నట్లు తెలిపారు.