మణుగూరు మండలం కట్టు మల్లారం ప్రభుత్వ పాఠశాలలో గురువారం రూ. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషకరమని, ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు.