కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారంటూ సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఒక పైసా కూడా కేటాయించకపోవడం ఎన్నికల జరిగే రాష్ట్రాలకి కేటాయించడంపై తీవ్రంగా ఖండించారు.