బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కును మంజూరు చేయించారు. మంగళవారం చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.