
నా జీతం.. మీ జీవితం కోసం: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.2,10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని సైతం వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.