పినపాక మండలంలోని వివిధ గ్రామపంచాయతీలలో ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు అతి కొద్ది రోజులకే పగుళ్లు వస్తున్నాయని జాతీయ ఆదివాసీ అభ్యుదయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే దొర అన్నారు. బుధవారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. నాణ్యతలేని రోడ్లు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.