కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలం గడ్డిగూడెంలో సోమవారం డీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పారు. సన్నబియ్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి రైతు కష్టానికి ప్రతిఫలం చూపించిందన్నారు.