డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ భారాస అనుబంధ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం అశ్వాపురంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గద్దల రామకృష్ణ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలన్నారు. డీఎస్సీ పరీక్షల కాలపరిమితి పెంచాలని భారాస యువజన విభాగం మండల అధ్యక్షుడు కొమరం సతీశ్ ఆళ్లపల్లిలో అన్నారు. ఆళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు.