మణుగూరు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి శనివారం పర్యటించారు. ఓసీ-4లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రోజువారీ బొగ్గు, ఓసీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. యాంత్రిక శక్తిని పూర్తిగా వినియోగించుకోవాలని, బొగ్గు సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.