అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని సీపీఐ మండల కార్యదర్శి మోహన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారులు ఒత్తిడి, వేధింపుల కారణంగా ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారని, బాధ్యులను ప్రభుత్వం వదిలిపెట్టవద్దని, వారి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.