మణుగూరు పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. చాలీచాలని జీతాలతో మున్సిపల్ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సీఐటీయూ నాయకులు అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.