సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా నుండి కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ అన్ఫిట్ కార్మికుల వారసులకు ఆదివారం జీఎం కార్యాలయంలో జీఎం వీసం కృష్ణయ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణిలో ఉద్యోగం రావడం అదృష్టంగా భావించాలని, బాధ్యతగా పనిచేయాలని, అలాగే భూగర్భ గనుల్లో పనిచేస్తే నైపుణ్యత పెరుగుతుందన్నారు.