చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన ఘటన పలువురిని కలిచివేసింది. ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామ పరిధిలో వేములవాడకు చెందిన నక్క గోపి, సునీత దంపతుల వివేక్(11) ఈనెల 25వ తేదీన డాబాపై ఆడుకుంటున్న వివేక్ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అంత్య క్రియల కోసం వివేక్ ను వేములవాడకు తీసుకురాగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.