
ఆస్తి కోసం భార్యను చంపేసిన భర్త
విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భోగాపురం మండలం రావాడగొల్లపేటలో ఆస్తి కోసం కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి కడతేర్చాడు. భార్య అంకాయమ్మను భర్త రమణ, అతడి బావ నర్సయ్య కలిసి ఉరివేసి హతమార్చారు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.