ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి పెద్దసంఖ్యలో BRS కార్యకర్తలు చేరుకున్నారు.