బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో సోమవారం జూన్ 16న ఏసీబీ విచారణకు హాజరుకావాలని కోరింది. దీంతో రేపు ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు. ACB ఇప్పటికే మే 26వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు.