లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు కీలక సూచనలు

81చూసినవారు
లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలా? ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా? అనే అంశంపై వాదనలు జరుగుతున్నాయి. ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సిట్‌ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్