తెలంగాణలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ఈనెల 10కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'కాంగ్రెస్ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యం.. ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందాం' అని కేటీఆర్ 'X'లో రాసుకొచ్చారు.