TG: భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్పై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతిపాదించారు. ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని సీఎం కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విరాళాన్ని ప్రకటించనున్నారు.