ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారత్లో సగటు ఆయుర్దాయం 72 ఏళ్లు.. అదే పాకిస్థాన్లో అయితే 67.6 ఏళ్లు. భారతదేశంలోని పాఠశాలలో విద్యార్థులు సగటున 13 ఏళ్లు విద్యనభ్యసిస్తే, పాకిస్థాన్లో 7.9 ఏళ్లు విద్యనభ్యసిస్తారు. భారతీయ మహిళలు సరాసరిన 13 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేస్తుండగా పాకిస్థానీ మహిళలు 7.3 సంవత్సరాలు మాత్రమే చదువుతున్నారు. దీన్ని బట్టి చూస్తే భారత్లో ఆయుష్షు, విద్యాకాలం రెండూ పాకిస్థాన్ కంటే ఎక్కువనే ఉన్నాయి.