TG: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నంది కమాన్ వద్ద ఆర్టీసీ బస్సు బైక్పై రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. అలాగే ముందుకు ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో కొనరావుపేట మండలం కొలునూర్ గ్రామానికి చెందిన తిరుపతి అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేములవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.