తెలంగాణ నిరుద్యోగ యువత జీవితాలు రాజీవ్ యువ వికాసం స్కీమ్తో మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు పెడుతుందని, బ్యాంకర్లు 1600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాల్సి ఉందని తెలిపారు. అధికారులు 3 రోజుల నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదలవ్వగానే, బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని విడుదల చేయాలని భట్టి సూచించారు.