పంజాబ్లోని భటిండా జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ మిస్సైల్ను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఈ దాడి యత్నానికి సంబంధించి మిస్సైల్ శకలాలు భద్రతా సిబ్బందికి లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో స్థానికులు శకలాలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను భయపడకుండా ఉండాలని సూచించారు.