AP: కూటమి ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఉండవల్లిలోని ప్రజాదర్బార్లో వాట్సాప్ గవర్నెన్స్ను మంత్రి లోకేశ్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలను అందించనున్నారు. కాగా తొలి విడతలో దీని ద్వారా 161 సేవలను టీడీపీ ప్రభుత్వం అందించనుంది. తొలి విడతగా విద్యుత్, దేవాదాయ శాఖ, రెవెన్యూ, ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.