ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ హాఫ్ సెంచరీ సాధించారు. మార్క్రమ్ 26 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో మార్క్రమ్కు ఇది 7వ అర్థశతకం. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 114/1గా ఉంది. క్రీజులో పూరన్ (37), మార్క్రమ్(50) ఉన్నారు.