పంజాబ్లో పేలకుండా పడిపోయిన మిస్సైల్ చైనా తయారీదిగా పోలీసులు గుర్తించారు. హోషియార్పూర్లో స్వాధీనం చేసుకున్న ఈ PL-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ను పాక్ లాంచ్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే లాహోర్లో HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చైనా ఆయుధాల నాణ్యతపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'మేడిన్ చైనా మిస్సైల్స్ కూడా తుస్సే' అని కామెంట్లు చేస్తున్నారు.