నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ భీమమ్మ లాలు యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరవుతున్నట్లు తెలిపారు. మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు విధిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు.