నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఐ ఆఫీస్ లక్ష్మణాచారి భవనంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో ఫీజు దోపిడి నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, ప్రకాష్ భూషణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.