వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శిరిడి సాయిబాబాను బుధవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బాలల హక్కులకు కమిషన్ ఛైర్మన్ సీత దయాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. సాయిబాబా కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.