భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లి తదితర గ్రామాలలో భూ భారతి అవగాహన సదస్సు కార్యక్రమాలకు కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని రైతులు ఉపయోగించుకోవాలన్నారు.