దేవరకద్ర నియోజకవర్గం గోపాన్ పల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్. సురేందర్ రెడ్డి తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత సేవా భావంతో ప్రముఖ వైద్యులతో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.