దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ శివారులోని కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం తొలి ఏకాదశి పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్, అధికారులు వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల ప్రజలు స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు.