మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శనివారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ. కార్మికుల హక్కులను బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మార్చడం దుర్మార్గమని అన్నారు, 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే 20 న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్మిక జేఏసీ పిలుపునిచ్చారు.