మహబూబ్ నగర్ జిల్లా నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గసభ్యులు గురువారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎంపీ డీకే అరుణ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ. ప్రజలకు ప్రభుత్వాలకు వారదులుగా జర్నలిస్టులు ఉండాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ చారి, ఉపాధ్యక్షుడు జనరల్ సెక్రటరీలు ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.