మహబూబ్ నగర్ జిల్లా బ్రాహ్మణవాడిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం పురవీధుల గుండా అమ్మవారిని అత్యంత శోభమానంగా ఊరేగిస్తూ భక్తి గీతాలకు చిన్నారులు, యువజన సంఘం సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమిటీ, యువజన సభ్యులు, ఆవోప, వాసవి క్లబ్, వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.