మహబూబ్ నగర్: కాంగ్రెస్ నేత భూకబ్జా చేశాడంటూ బాధితుల ఆందోళన

81చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల తహశీల్దార్ ఆఫీస్ ముందు బుధవారం ఆంజనేయులు యాదయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత తమ భూమిని బలవంతంగా లాక్కొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధర్నాకు దిగారు. మండలంలోని అమ్మాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 72, 73లో ఉన్న 26ఎకరాల భూమిని తాము తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని అన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ వృత్తిదారుల కార్యదర్శి నాగయ్య కోరారు.

సంబంధిత పోస్ట్