మహబూబ్ నగర్: భూ భారతిపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

62చూసినవారు
మహబూబ్ నగర్: భూ భారతిపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి- 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 'భూ భారతి' భూమి హక్కుల రికార్డు -2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్