మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు ఎండ వేడికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 10 ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కటీ తిరగకపోవటం ప్రయాణికులకు సేవలందించలేక పోవటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రాష్ట్రంలో ఆదాయం సమకూర్చడంలో మహబూబ్ నగర్ డిపో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ ప్రయాణికులు ఉక్కబోతతో ఇబ్బందులు ఎదుర్కోవడం గమనార్హం.