రెడ్ క్రాస్ సేవలు అమోఘం: మహబూబ్ నగర్ కలెక్టర్

62చూసినవారు
రెడ్ క్రాస్ సేవలు అమోఘం: మహబూబ్ నగర్ కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అమోఘమని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ ఛైర్మన్ నటరాజ్ అధ్యక్షతన జరిగిన తలసేమియా బాధితుల సమావేశంలో కలెక్టర్ హాజరై మాట్లాడుతూ. గాయపడిన క్షతగాత్రులకు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఇబ్బందులలో ఉన్నవారికి వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో రెడ్ క్రాస్ చురుకైన పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్