మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్ లో గురువారం ఉదయం 10: 00 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై తనను ఎంపీగా గెలిపించిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృజ్ఞతలు తెలుపనున్నారు. ఈ సందర్భంగా నాయకుల, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులు కోరారు.