జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను బుధవారం పీఠాధిపతులు అష్టాక్షరి సంపత్ కుమార్, రామానుజన్ జీయర్ స్వామి విజయవాడ పీఠం నుంచి వచ్చి దర్శించుకున్నారు. వారికి ఈఓ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు శిష్య బృందం పాల్గొన్నారు.