జోగులాంబ గద్వాల నియోజకవర్గానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ. 3,88,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, జెడ్పి మాజీ చైర్ పర్సన్ సరిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక నిరుపేదల ప్రాణాలు నిలుపబడుతున్నాయని చెప్పారు. పార్టీ నేతలు శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.