ప్రస్తుతం వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. రైతులు పొలాల దగ్గర మరియు ధాన్యం కొనుగోలు దగ్గర ఆరబెట్టిన వరి ధాన్యాన్ని తాటి పత్రాలు కప్పుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సూచించారు. పత్తిరైతులు కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు.