జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో శుక్రవారం ఉదయం కొత్త రకం జలచరాలు దర్శనమిచ్చాయి. పొడవుగా, పొట్టిగా, వింతగా ఉండే జలచరాలు నదిలో కదులుతూ కనిపించాయి. పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్లిన భక్తులు వాటిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.