రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష రాసేందుకు పాలమూరుకు వెళ్లే విద్యార్థులతో శనివారం గద్వాల రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడటంతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీటు సంపాదించేందుకు ఎంట్రెన్స్ పరీక్ష రాశారు. గద్వాల జిల్లా నుంచి పరీక్ష రాసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్లడంతో రైల్వే స్టేషన్ వద్ద విద్యార్థుల రద్దీగా మారింది.