సీఎంఆర్ఎఫ్ పథకం పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా అని జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత అన్నారు. గద్వాల పట్టణానికి చెందిన ఐదుగురు బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం క్యాంప్ కార్యాలయంలో ఆమె పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.