జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని ఆరేకటిక సంఘం నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరెకటిక కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరెకటిక పట్టణ అధ్యక్షుడు ధర్మకారి బాలాజీ, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.