పైప్ లైన్ లీకేజీతో అవస్థలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని 8వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు నిలిచింది. మూడు నెలల కింద పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. దీన్ని సక్రమంగా చేయకపోవడంతో ప్రస్తుతం నీరు లీక్ అవుతుంది. ఆదివారం కాలనీ చిత్తడి చిత్తడిగా మారింది.